కరోనాను నిర్వీర్యం చేసే పెయింట్
కరోనా వైరస్ను నిర్వీర్యం చేసే పెయింట్ను అమెరికాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. తలుపుల గడియలు, గ్లాస్ డోర్లపై, స్విచ్ బోర్డులు, షాపింగ్ మాల్స్లో ఉండే బుట్టలు, కార్ట్లపై ఈ పెయింట్ను వేస్తే.. దాని ఉపరతలంపై వాలే కరోనా వెంటనే నిర్వీర్యమవుతుందని వారు వివరించారు. దీనివల్ల కరోనా వ్యాప్తిని చాలా వరకు నియంత్రించవచ్చని వర్జీనియా టెక్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకు పరిశీలిస్తే ఈ పెయింట్ వేసిన గంట వ్యవధి వరకు 99.9 శాతం వరకు కరోనా వైరస్ నిర్వీర్యమైనట్లు తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు.






