ఏపీలో 3,791కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా ఉద్ధ•తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12,613 మంది నమూనాలు పరీక్షించగా 115 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 33 ఉండగా, రాష్ట్రంలో 82 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,791 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 64. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,209కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 927 మంది చికిత్స పొందుతున్నారు.






