పపంచంలోనే యాపిల్ మొదటి స్థానం.. రెండోస్థానంలో
పపంచంలోకెల్లా అత్యంత సంపన్న కంపెనీగా అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ నిలిచింది. యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 2.4 లక్షల కోట్ల డాలర్లు అని లండన్కు చెందిన హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. 2022 ఏడాదికి గానూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్న కంపెనీల జాబితాలను ఈ సంస్థ విడుదల చేసింది. ఇక రెండవ స్థానంలో 1. 8 లక్షల కోట్ల డాలర్ల విలువతో మైక్రోసాఫ్ట్ నిలించింది. మొత్తం 500 కంపెనీల పేర్లతో లిస్ట్ విడుదల చేయగా ందులో భారతదేశానికి చెందిన రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహా 20 కంపెనీలకు చోటు దక్కింది. ఈ 500 కంపెనీల మొత్తం స్థం 11.1 లఓల కోట్ల డాలర్లు అని హురూన్ సంస్థ తెలిపింది. గత రెండు సంవత్సరాల అంచనాలతో పొలిస్తే తాజాగా ఈ కంపెనీల విలువ 7 బిలియన్ డాలర్లు పెరిగిందని హురూన్ ఇండియా చైర్మన్ రూపర్ట్ హుగెవెర్స్ తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు గౌతమ్ ఆదానీకి చెందిన పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్ నాలుగవ స్థానం దక్కించుకుంది. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఐదవ స్థానంలో, వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్షైర్ హాథవే 624 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో నిలిచాయి.






