ఉద్యోగులకు విప్రో గుడ్ న్యూస్
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా గ్లోబల్గా దిగ్జ కంపెనీల్లో సైతం ఉద్యోగాల కోత ప్రకంపనలు పుట్టిస్తున్న తురుణంలో విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వేరియబుల్ పే అందించనుంది. థర్డ్ క్వార్టర్లో 87 శాతం మేరియబుల్ పే విడుదల చేయనున్నామని అంతర్గత ఇమెయిల్లో ఉద్యోగులకు తెలిపింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంలో విడుదల చేయనుంది. విప్రో 2023-23 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఎ నుండి బి3 బ్యాండ్లలోని ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్ను విడుదల చేయనున్నట్లు విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారం అందించారు. ఎ నుంచి బి3 లెవల్ ఉద్యోగులు, అన్ని సపోర్ట్ ఫంక్షన్స్లో పనిచేసే సిబ్బందికి ఐటీ కంపెనీ పెర్ఫామెన్స్ పనితీరు ఆధారంగా 87 శాతం వేరియబుల్ పే చెల్లించనుండగా, మేనేజర్ స్థాయి, అంతకుమించి లెవెల్ ఉద్యోగులకు బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారిత వేరియబుల్ పే చెల్లించనుంది. అందరు ఉద్యోగులు అంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉంటారు.






