స్విగ్గీ కొత్త సర్వీస్ ప్రారంభం… తప్పిపోయిన

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్త సర్వీస్ను ప్రారంభించింది. జంతుప్రియుల కోసం కొత్తగా స్విగ్గీ పోలీస్ పేరుతో ఈ సర్వీస్ను తీసుకు వచ్చింది. తప్పిపోయిన పెట్స్ను వెతికి తెచ్చేందుకు ఈ సేవలను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ సేవ ద్వారా తప్పిపోయన జంతువులను సంబంధించి వివరాలు ఫోటోలతో యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. సంస్థకు చెందిన డెలివరీ భాగస్వాములు తప్పిపోయిన జంతువులు గుర్తించి వాటి వివరాలను, లొకేషన్ను స్విగ్గి టీమ్కు తెలియజేశారు. వెంటనే అప్డేట్ను పెట్ ఒనర్లకు తెలుపుతారు. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ సాయంతో పెట్ను కనిపెడతారు. ఏప్రిల్ 11న జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. టాటా ట్రస్ట్ జనరల్ మేనేజర్ శంతను నాయుడు, హౌస్ ఆఫ్ చైర్మన్ సమక్షంలో ఈ సేవలను పరిచయం చేసింది. 3.5 లక్షల మంది డెలివరీ భాగస్వాములు ఈ సేవలను అందించడం లో సాయపడతారని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ పేస్ల్ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు.