జాక్ మాకు మరో షాక్
చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరో షాక్ తగిలింది. చైనా ప్రభుత్వ పెద్దల కోసం తెప్పించేలా వ్యవహరించిన జాక్ మా ఫిన్టెక్ సంస్థ యాంట్ గ్రూప్పై నియంత్రణను సైతం కోల్పోనున్నారు. ఈ మేరకు ఓటింగ్ హక్కులను మారుస్తూ కంపెనీ వాటాదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజ్మెంట్, ఉద్యోగుల ఓటింగ్ హక్కుల్లో మార్పులు చేశారు. ఈ నిర్ణయం వల్ల వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఏమాత్రం ఆటంకం ఏర్పడబోతోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో జాక్ మా కంపెనీపై తన పట్టును కోల్పోనున్నారు.






