ప్రపంచంలోనే అత్యాధునిక సైనిక బాంబర్ విమానం ఇదే… ఖరీదు రూ.16,200 కోట్లు
అమెరికా అమ్ములపొదిలో ఇప్పటి వరకు ఉన్న అత్యుత్తమ స్టెల్త్ బాంబర్ యుద్ధ విమానం బి-2 స్పిరిట్. దీని స్థానంలో అత్యాధునిక బి-21 రైడర్లు త్వరలో చేరనున్నాయి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అత్యాధునిక సైనిక బాంబర్ విమానం ఇదే అని దీన్ని తయారు చేసిన నాథ్రాప్ గ్రమ్మన్ సంస్థ పేర్కొంది. ఆరో తరానికి చెందిన ఈ స్టెల్త్ బాంబర్ విమానాన్ని ఆ సంస్థ కాలిఫోర్నియాలో ఆవిష్కరించనుంది. ఒక్కో బి`21 రైడర్ ఖరీదు సుమారు 16,200 కోట్లు. ప్రారంభంలో మొత్తం ఆరు రైడర్లను ఈ సంస్థ తయారు చేయనుంది. 2023లోపు ఇవి అమెరికా సైన్యంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. సంప్రదాయ, అణ్వాయుధాలతో పాటు, భవిష్యత్తులో వినియోగంలోకి రానున్న లేజర్ ఆయుధాలనూ ప్రయోగించే సామర్థ్యం ఈబి`21 రైడర్ల ప్రత్యేకత. ప్రత్యర్థులకు చిక్కకుండా దొరకకుండా ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా ఇవి చేధించగలవు.






