అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండండి
అమెరికా పౌరులంతా తక్షణమే రష్యాని విడిచి తమ దేశానికి వెళ్లాలని అనేకసార్లు కోరిన రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు తాజాగా మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. మాస్కో లో ప్రజలు ఎక్కువగా గుమిగూడే పెద్ద సమావేశాలను, కచేరీలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 48 గంటల్లో జరిగే సభలు, సమావేశాలకు ప్రజలు దూరంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలను కనిపెట్టుకొని ఉండాలని రాయబార కార్యాలయం తెలిపింది.
Tags :