తెలంగాణ పథకాలు అద్బుతం : సిక్కిం మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకనాథ శర్మ మీడియాతో మాట్లాడుతూ పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాలను అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సిక్కిం రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తాను అనేక విషయాలు తెలుసుకొన్నాను అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కృత్రిమ గర్బధారణ కార్యక్రమం వలన మేలుజాతి పశుసంపద ఉత్పత్తి జరుగుతుంది. ఇది పాడి రైతులకు ఎంతోప్రయోజనకరంగా ఉంటుందని అని అన్నారు.