పుష్ప2లో అనసూయ షాక్ ఇవ్వనుందా?
రామ్ చరణ్ను మొదటిసారి డిఫరెంట్ క్యారెక్టర్లో చూపిస్తూ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలో చిట్టి బాబు పాత్రలో వినికిడి లోపమున్న యువకుడిగా చరణ్ క్యారెక్టర్ని సుకుమార్ డిజైన్ చేసిన తీరు వావ్ అనిపించిది.ఈసినిమాలో రామలక్ష్మిగా పక్కా పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో సమంత కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ని రాబట్టింది.
ఇదిలా ఉంటే ఈ మూవీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా నిలిచిన మరొకరు అనసూయ. అప్పటి వరకు సాదా సీదా యాంకర్గా ఉన్న అనసూయ కెరీర్ ఈ సినిమా తర్వాత ఓ రేంజ్ లో మారిపోయింది. దానికి కారణం తన క్యారెక్టర్ని సుకుమార్ మలిచిన తీరే. భర్త చనిపోయినా సరే తను దుబాయ్లో ఉన్నాడంటూ కాలం వెల్లదీసే గడసరి రంగమ్మత్తగా అనసూయ నటించిన తీరు ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్ అయేలా చేసింది.
ఈ సినిమాతో టాలీవుడ్లో అనసూయ హాట్ టాపిక్గా మారడమే కాకుండా వరుస ఆఫర్లని పట్టేసి, నటిగా మంచి పొజిషన్కు వెళ్లింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా అనసూయకు రంగమ్మత్త రేంజ్ క్యారెక్టర్లు మాత్రం పడలేదు. దీంతో మరోసారి పుష్ప సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న దాక్షాయణి పాత్ర ఇచ్చాడు సుకుమార్. సినిమా అంతా కనిపించినా తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత మాత్రం కనిపించలేదు. సినిమా క్లైమాక్స్లో సునీల్ని బ్లేడ్తో కోసే సీన్ తప్ప.
అయితే రీసెంట్గా స్టార్ట్ అయిన పుష్ప2లో మాత్రం అనసూయతో సుక్కు మెరుపులు మెరిపించనున్నాడట. ఇందులో అనసూయ రన్ టైమ్తో పాటు క్యారెక్టర్ కు ప్రాధాన్యత కూడా ఎక్కువే అని, అంతే కాకుండా పార్ట్2లో ఊర మాస్ సాంగ్ను కూడా అనసూయతో సుక్కూ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రాధాన్యత ఎక్కువ అంటే అనసూయ ఫహద్ ఫాజిల్తో కలిసి పుష్పరాజ్పై కుట్రలు చేయనుందా? లేదంటే తనొక్కటే సోలోగా పుష్పరాజ్పై పగ తీర్చుకోనుందా అనేది తెలియాలంటే పుష్ప2 సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.