STT Data Center :తెలంగాణలో భారీ పెట్టుబడి.. రూ.3,500 కోట్లతో ఎస్టీటీ డాటా సెంటర్

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్టీటీ డేటా సెంటర్(STT Data Center )ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్బాబు (Sridharbabu) సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ (Singapore)లోని ఎస్టీటీ డాటా సెంటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్టీటీ సీఈవో బ్రూనో(Bruno) సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్ సిటీ (Hi-tech City )లో ఓ డేటా సెంటర్ నిర్వహిస్తోన్న ఎస్టీటీ ముచ్చర్ల (Mucharla )మీర్ఖాన్పేటలోని మరో డాటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఎస్టీటీ డాటా సెంటర్స్ సంస్థ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. డాటా సెంటర్ హబ్గా హైదరాబాద్ మారుతోందన్నారు.