President: హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనస్వాగతం

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(Draupadi Murmu) గారికి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి గారికి స్వాగతం పలికినవారిలో మంత్రి సీతక్క గారు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా గారితో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.