తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 15న, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ 16న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సీఎస్ సూచించారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి కాన్వాయ్ పయనించే మార్గాల్లో మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.