Kishan Reddy : పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలలుగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని వీధిలైట్ల నిర్వహణకు నిధుల కొరత ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేస్తే, అదే విధానాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శించారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉందని, పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (Hydra) అని పేరు పెట్టిందన్నారు. మెట్రో (Metro) రెండో దశకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని, అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు.