Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Political Articles » Kaleshwaram commission notice to brs chief kcr

KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..! విచారణలో కీలక మలుపు..!!

  • Published By: techteam
  • May 20, 2025 / 04:30 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Kaleshwaram Commission Notice To Brs Chief Kcr

తెలంగాణలో నాటి కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం (Kaleswaram). అయితే ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (Justice P C Ghosh Comission) నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిషన్ అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్.. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది. అలాగే హరీశ్ రావు (Harish Rao), ఈటల రాజేందర్ (Etela Rajendar) కు కూడా నోటీసులు పంపించింది. దీంతో ఈ విచారణ మరో మలుపు తీసుకుంది.

Telugu Times Custom Ads

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR), మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు నాయకులు ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని, బ్యారేజీల డిజైన్, నిర్మాణ స్థల ఎంపిక, ఆర్థిక వ్యవహారాల్లో వారి పాత్ర గురించి సాక్ష్యాలు సేకరించినట్లు కమిషన్ పేర్కొంది. నోటీసులకు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, అలాగే వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలని సూచించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు.. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మితమైన బహుళ ప్రయోజన నీటిపారుదల పథకం. దీని లక్ష్యం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం. 2016లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు రూ. 80,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది రూ. 1.47 లక్షల కోట్లకు చేరింది. అయితే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్, నిర్మాణ లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఈ ప్రాజెక్టును వివాదాస్పదంగా మార్చాయి. ఈ లోపాల వల్ల రూ. వేల కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు ఆరోపణలు వచ్చాయి.

విచారణలో భాగంగా కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. అఫిడవిట్‌లు సేకరించి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావులు డిజైన్లను త్వరగా ఆమోదించాలని ఒత్తిడి చేశారని కమిషన్ ముందు వెల్లడించారు. అలాగే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, కాగ్ అధికారులు కూడా విచారణలో పాల్గొన్నారు. ఈ విచారణలో బ్యారేజీల నిర్మాణ స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, ఆర్థిక అవకతవకలపై ప్రధాన దృష్టి సారించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, నాణ్యతా లోపాలపై నిపుణుల కమిటీ నివేదికలను కమిషన్ పరిశీలించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 48,665 కోట్ల విలువైన పనులను పర్యవేక్షించిన ఈఎన్సీ భూక్యా హరిరామ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇటీవలే అరెస్టయ్యారు.

తాజా నోటీసులతో కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్‌లపై విచారణ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గతంలో భూపాలపల్లి జిల్లా కోర్టు కూడా వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ, హైకోర్టు ఆ నోటీసులను సస్పెండ్ చేసింది. ఈసారి కమిషన్ విచారణకు వారు హాజరవుతారా లేక చట్టపరంగా ఎదుర్కొంటారా అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ నెలాఖరలోపు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే రెండ్రోజుల కిందటే కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత మందిని విచారించి సమగ్రంగా నివేదిక అందించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.

 

 

Tags
  • BRS
  • Kaleshwaram Commission
  • KCR
  • notice
  • Telangana

Related News

  • Is The Government Targeting The Police

    Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?

  • Are There Any Additions To The Alliance Or Not

    Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?

  • Sharmilas Big Planning In Ap Rahuls Invitation

    Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!

  • Jagan Mohan Reddy Petitions High Court For Lop Status

    Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?

  • A Central Project That Provides Employment To Handloom Workers Through Balayyas Efforts

    Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..

  • Jagans Petition Seeking Cancellation Of Speakers Ruling

    Jagan: స్పీకర్ రూలింగ్ రద్దు కోరుతూ జగన్ పిటిషన్.. రాజకీయ వర్గాల్లో చర్చ..

Latest News
  • TLCA: టీఎల్‌సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ
  • MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
  • Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి
  • Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?
  • Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?
  • Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!
  • TANA: మినియాపాలిస్‌లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్
  • GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు
  • Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?
  • Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer