RTA: తెలంగాణలో అప్రమత్తమైన రవాణా శాఖ.. హైదరాబాద్లో
కర్నూలు (Kurnool) బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీ చేశారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ (RTA) బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ట్రావెల్ బస్సుల (Travel buses) ను తనిఖీ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్ల (Medical kits) ను పరిశీలించారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు అద్దం పగిలినా అలాగే నడుపుతున్న ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. జడ్చర్ల వద్ద ఈ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు తెలిపారు. ఎల్బీ నగర్లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు.







