హైదరాబాద్లో రూ.400 కోట్లతో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ పెట్టుబడి
తెలంగాణలో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ శివారు జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్ కార్యకలాపాలపై ప్రకటన చేశారు. సంస్థ విస్తరణతో 500 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. గ్లాండ్ ఫార్మా సంస్థ ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బయోలాజికల్స్, బాయోసిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తదితర అడ్వాన్స్డ్ రంగాలపై సంస్థ దృష్టి సారించడం సంతోషకరమని కేటీఆర్ అన్నారు.






