Manda Jagannadham :మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

నాగర్కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం (manda jagannadham) (74) అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital)లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం, నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం (Telugu Desam )నుంచి 2009 లో కాంగ్రెస్(Congress) నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్సభ ఎన్నికల ముందు బీఎస్పీ (BSP)లో చేరారు. మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.