Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Political Articles » Etela rajender press briefing after kaleshwaram commission inquiry

Etela Rajendar: అన్ని విషయాలూ మామా అల్లుళ్లకే తెలుసు..! కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల వెల్లడి..!?

  • Published By: techteam
  • June 6, 2025 / 03:15 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Etela Rajender Press Briefing After Kaleshwaram Commission Inquiry

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) అక్రమాలపై జరుగుతున్న జ్యుడీషియల్‌ కమిషన్‌ (Judicial Commission) విచారణకు భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender) హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఈటలను కమిషన్‌ పిలిపించి పలు అంశాలపై ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR), నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) వద్దే ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో ఆర్థిక శాఖ పాత్ర చాలా పరిమితమని, ఆ శాఖకు అన్ని వివరాలు తెలియవని ఆయన పేర్కొన్నారు.

Telugu Times Custom Ads

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఈటల రాజేందర్ నొక్కి చెప్పారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌ కోసం కేసీఆర్‌ నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌-కమిటీ ఏర్పాటైందని, దీనికి హరీశ్‌ రావు ఛైర్మన్‌గా వ్యవహరించారని తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టినట్లు ఆయన వివరించారు. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, రాజకీయ నాయకులకు దీనిపై పూర్తి అవగాహన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొదట రూ.63 వేల కోట్లతో ప్రతిపాదించగా, తర్వాత వివిధ కారణాల వల్ల ఖర్చు రూ.82 వేల కోట్లకు పెరిగినట్లు ఈటల తెలిపారు. కమిషన్‌ విచారణలో ఆర్థిక శాఖకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలు వచ్చాయని, ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణాల్లో ఆర్థిక శాఖ పాత్ర గురించి అడిగినట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ రుణాల విషయంలో ఆర్థిక శాఖకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇది పూర్తిగా నీటిపారుదల శాఖ పరిధిలోని వ్యవహారమని ఈటల స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రిపోర్టులను ప్రజల ముందు ఉంచాలని ఈటల డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని, ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును తన మానసపుత్రికగా వందల సార్లు పేర్కొన్నారని, తాను ఏ పార్టీలో, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలను పాటిస్తానని ఈటల అన్నారు.

కేబినెట్‌ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఈటల కమిషన్ కు వివరించినట్లు సమాచారం. సాంకేతిక కమిటీ, క్యాబినెట్‌ సబ్‌-కమిటీ సిఫార్సుల ఆధారంగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (CWC), మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు స్థానాన్ని తమ్మిడిహట్టి (Tammidihatti) నుంచి మేడిగడ్డకు (Medigadda) మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిధుల కొరత కారణంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేయాలని డీపీఆర్‌లో ఉందని ఆయన తెలిపారు.

బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలు నీటిపారుదల శాఖ పరిధిలోనివేనని ఆయన సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక నిర్ణయాలు, రీ-డిజైనింగ్‌, బడ్జెట్‌ పెంపు వంటి విషయాలు ఆర్థిక శాఖ పరిధిలోకి రావని, అవన్నీ నీటిపారుదల శాఖ, సాంకేతిక నిపుణుల బాధ్యత అని ఈటల స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో నిజాలు బయటకు రావాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్‌ చేశారు. అదే సమయంలో.. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు నిజానిజాలను విచారించి న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

Tags
  • BRS
  • Etela Rajender
  • Harish Rao
  • Kaleshwaram Commission
  • KCR

Related News

  • Jagan Mohan Reddy Petitions High Court For Lop Status

    Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?

  • A Central Project That Provides Employment To Handloom Workers Through Balayyas Efforts

    Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..

  • Jagans Petition Seeking Cancellation Of Speakers Ruling

    Jagan: స్పీకర్ రూలింగ్ రద్దు కోరుతూ జగన్ పిటిషన్.. రాజకీయ వర్గాల్లో చర్చ..

  • Ambati Rambabu Comments On Og Movie

    Ambati Rambabu: ఓజీ పై అంబటి సెటైర్లు .. సోషల్ మీడియాలో జనసేనికుల కౌంటర్..

  • From Assembly Comments To Legal Notices New Challenges For The Coalition Government

    NDA Alliance: అసెంబ్లీ వ్యాఖ్యల నుంచి లీగల్ నోటీసుల వరకూ – కూటమి ప్రభుత్వానికి కొత్త సవాళ్లు..

  • Telangana Hc Grants Relief To Tgpsc On Group 1 Mains Exams

    Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!

Latest News
  • Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?
  • Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
  • Jagan: స్పీకర్ రూలింగ్ రద్దు కోరుతూ జగన్ పిటిషన్.. రాజకీయ వర్గాల్లో చర్చ..
  • Ambati Rambabu: ఓజీ పై అంబటి సెటైర్లు .. సోషల్ మీడియాలో జనసేనికుల కౌంటర్..
  • NDA Alliance: అసెంబ్లీ వ్యాఖ్యల నుంచి లీగల్ నోటీసుల వరకూ – కూటమి ప్రభుత్వానికి కొత్త సవాళ్లు..
  • Nara Lokesh: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
  • Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!
  • Digital Book: రెడ్‌బుక్‌కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్..!
  • Nara Lokesh: మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్
  • YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer