Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..

విద్యా విధానం లో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.. నూతన పాలసీ వల్ల విద్యా విధానం లో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి.. గతంలో తెలంగాణ (Telangana) విద్య లో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయి. ఓపెన్ మార్కెట్ కారణం గా అంతర్జాతీయ స్థాయి కి మన విద్యా విధానం సరితూగడం లేదు.. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వారి లో 15 శాతం మంది కి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు..
విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది.. విద్యా శాఖ కు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుంది .. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం.. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయం.. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలి.. 73 లక్షల మంది యువత కు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం..
దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి.. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దం గా పనిచేయాలి.. స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయి.. 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రి ని కోరాను.. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి.. విద్య విషయం లో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయం గా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధం..