MLC Elections :తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు … అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) కు సంబంధించి అభ్యర్థులను బీజేపీ (Bjp) ప్రకటిచింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్రెడ్డి ( వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య ( పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.