KTR: మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కు తెలంగాణ ఏసీబీ (ACB) నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా -ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటుచేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఎంఏయూడీ( పురపాలక శాఖ) ముఖ్య కార్యదర్శి దానకిశోర్ (Danakishore) నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఏసీబీ ఇటీవల దానకిశోర్ నుంచి సుమారు ఏడు గంటలపాటు వివరాలను తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది.
Tags