Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Ysrcp mp mithun reddy gets bail from acb court

Midhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?

  • Published By: techteam
  • September 30, 2025 / 03:49 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ysrcp Mp Mithun Reddy Gets Bail From Acb Court

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం కేసుపై (AP Liquor Scam Case) చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి (Peddireddy Midhun Reddy) ఏసీబీ కోర్టు (ACB Court) బెయిల్ (bail) మంజూరు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. 71 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపిన ఆయన సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ మద్దతుదారుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అయితే, ఈ బెయిల్ వెనుక అడ్వకేట్ల లోపాలు, ప్రభుత్వ కుమ్మక్కు, లేదా చట్టపరమైన హక్కులు అనే వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషి అయిపోరని, కేసు ఇంకా పెండింగ్‌లో ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.

Telugu Times Custom Ads

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. ఏసీబీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. మిథున్ రెడ్డి ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. వైసీపీ హయాంలో మద్యం అక్రమ లావాదేవీలు జరిగాయని, లైసెన్సుల మంజూరులో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. మిథున్ రెడ్డి మీద మద్యం అక్రమ రవాణా, ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. జూలై 20న మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశాయి. తాజాగా ఆయనకు ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచికత్తుతో, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరుకావాలని షరతు పెట్టింది.

టీడీపీ మద్దతుదారులు ఈ బెయిల్‌ను ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్నారు. అడ్వొకేట్లు సరిగా వాదించకపోవడం వల్లే మిధున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆరోపిస్తున్నారు. మిధున్ రెడ్డిపై ఛార్జ్ షీట్ నమోదులో దర్యాప్తు సంస్థలు కూడా విఫలమయ్యాయని, తగిన ఆధారాలను చూపెట్టి ఉంటే బెయిల్ వచ్చేది కాదని సూచిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే కేసు నీరుగారిపోతున్నట్టు అర్థమవుతోందని, త్వరలోనే మిగిలిన నిందితులు కూడా బయటకు వస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు టీడీపీ నేతలైతే, వైసీపీ నేతలతో ప్రభుత్వం కుమ్మక్కు అయిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ బెయిల్‌ను తమ విజయంగా భావిస్తున్నాయి. వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా మిథున్ రెడ్డి నిర్దోషి అని తీర్పులు చెప్పేశాయి. న్యాయం గెలిచింది అని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వాస్తవానికి నిందితులకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భారతీయ శిక్షా చట్టం సెక్షన్ 167 ప్రకారం, చార్జ్‌షీట్ 90 రోజుల్లో ఫైల్ చేయకపోతే బెయిల్ దొరుకుతుంది. మిథున్ రెడ్డి 71 రోజులు జైలులో ఉన్నారు కాబట్టి ఇది సహజమే. అయితే బెయిల్ దొరికినంత మాత్రాన నిర్దోషి అయిపోరని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఆయా కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తుకు నిందితులు సహకరించాలి. మిధున్ రెడ్డి విషయంలో కోర్టు అనేక షరతులు విధించింది. కాబట్టి లాయర్లు సరిగా వాదించలేదనడం సమంజసం కాదు. అలాగే ఆయన నిర్దోషిత్వం బయటపడిందని వైసీపీ నేతలు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. న్యాయస్థానాల తుది తీర్పు వరకూ వేచి చూడాల్సిందే.!

 

 

 

Tags
  • ACB Court
  • AP Liquor case
  • MP Mithun Reddy
  • Ysrcp

Related News

  • Prashant Kishor Earned Rs 241 Crore Over Last 3 Years Through Consultancy Services

    Prasant Kishor: 2 గంటల్లో 11 కోట్లు..! దటీజ్ ప్రశాంత్ కిశోర్..!!

  • Fishermen Protest Blocks Home Minister Anitha In Payakaraopeta

    Vangalapudi Anitha: తాటి చెట్లతో పాయకరావుపేట మత్స్యకారుల వినూత్న నిరసన.. కంగుతిన్న హోమ్ మినిస్టర్..

  • Chandrababu And Nara Lokesh Delhi Tour

    Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..

  • Chinta Mohan Fact Sheet A Concern For The Alliance

    Chinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..

  • Ap Volunteers Then Jagans Soldiers Now Enemies Of Ysrc

    AP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..

  • Cm Chandrababu Family Visits Vijayawada Kanaka Durgamma Temple

    Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..

Latest News
  • Prasant Kishor: 2 గంటల్లో 11 కోట్లు..! దటీజ్ ప్రశాంత్ కిశోర్..!!
  • VVPB: హ్యూస్టన్‌ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు
  • H1B Visa: కొత్తగా హెచ్-1 బికోసం దరఖాస్తు దారులకు మాత్రమే లక్షడాలర్ల ఫీజు.. అమెరికా నిపుణుల క్లారిటీ..
  • Midhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?
  • Vangalapudi Anitha: తాటి చెట్లతో పాయకరావుపేట మత్స్యకారుల వినూత్న నిరసన.. కంగుతిన్న హోమ్ మినిస్టర్..
  • Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..
  • Chinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..
  • AP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..
  • Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
  • Chandrababu: గత ప్రభుత్వం ట్రూఅప్‌ … కూటమి ప్రభుత్వం ట్రూడౌన్‌తో
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer