Ys Sharmila: బైబిల్ మీద ఒట్టు.. ఫోన్ ట్యాపింగ్ జరిగింది

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) జరిగింది అనేది వాస్తవమని.. నా ఫోన్,నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని, అనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు అని సంచలన కామెంట్స్ చేసారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా అన్నారు షర్మిల.
బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం అంటూ షర్మిల బాంబు పేల్చారు. రేవంత్, చంద్రబాబు(Chandrababu Naidu) ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అంటూ షర్మిల వ్యాఖ్యలు చేసారు. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని వ్యాఖ్యానించారు.
ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్ళన్నారు. వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయిందని.. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అంటూ కామెంట్స్ చేసారు షర్మిల. నా ఫోన్ ట్యాప్ అయినట్లు నాకు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారని.. అప్పుడు వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారన్నారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా..అంటే అనుమానమే ? అన్నారు షర్మిల. జగన్ తన సొంత మేనల్లుడు,మేన కోడలు అస్థి కాజేసే అంశంలో సుబ్బారెడ్డి తో అబద్ధాలు చెప్పించాడన్నారు.
ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోనన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తాను, ఏ విచారణను అయినా ఎదుర్కొంటా అని స్పష్టం చేసారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు.. ఇది అక్రమం,అనైతికం కదా అని నన్ను అడగొచ్చు, స్వయంగా మీ ఇంట్లో మీరు వింటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగొచ్చు.. అన్నాడు ఉన్న పరిస్థితులు వేరు.. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు అంటూ సంచలన కామెంట్స్ చేసారు షర్మిల. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నదన్నారు.
నా భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారన్నారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర చేసారని.. నాకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారు అని ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. నా అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారని.. నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు అని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు షర్మిల. నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదని.. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడని.. తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడని వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేసారు షర్మిల.