C.R. Patil : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి .. కేంద్రం ఏర్పాట్లు

జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న ఢల్లీిలో కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమావేశం కావాలని కేంద్రం కోరింది. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులకు వీలవుతుందో లేదో తెలపాని పేర్కొంది. మరోవైపు కృష్ణా (Krishna) , గోదావరి (Godavari) వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నారు.