Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Old man died after hit by vehicle in ys jagan mohan reddy convoy

YS Jagan: జగన్ పల్నాడు పర్యటనలో విషాదం.. ఇద్దరు మృతి..

  • Published By: techteam
  • June 18, 2025 / 04:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Old Man Died After Hit By Vehicle In Ys Jagan Mohan Reddy Convoy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) మండలం రెంటపాళ్ల (Rentapalla) పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వైసీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వైసీపీ నేతలు అడుగడుగునా ఆంక్షలను ఉల్లంఘించారని పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు పోతున్నా జగన్ మాత్రం పట్టించుకోకుండా పర్యటించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

Telugu Times Custom Ads

జగన్ రెంటపాళ్ల పర్యటన ఆద్యంతం హడావుడిగా సాగింది. తాడేపల్లి నుంచి బయలుదేరిన కాసేపటికే ఓ వాహనం లింగయ్య అనే ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయారు. జగన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఆ తర్వాత సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఈ రెండు మరణాలు స్థానికులను, వైసీపీ కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. జగన్ ఈ పర్యటనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త, మాజీ డిప్యూటీ సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.

పల్నాడు జిల్లా పోలీసులు జగన్ పర్యటనకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. కేవలం మూడు వాహనాలు, 100 మంది కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో జగన్ పోడిలి పర్యటనలో జరిగిన రాళ్ల దాడులు, ఘర్షణల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లతో వందలాది కార్యకర్తలు జగన్ కాన్వాయ్‌తో రెంటపాళ్లకు చేరుకున్నారు. పల్నాడు ఎస్పీ కొంచి శ్రీనివాసరావు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు.

వైసీపీ నాయకులు పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రాజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌చార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగన్ జనాదరణకు భయపడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తల మరణాలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు.

టీడీపీ నాయకులు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కాన్వాయ్‌లో అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని, బాధ్యత వహించి క్షమాపణ చెప్పకుండా జగన్ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌ను రాజకీయ సర్కస్ సృష్టించి, ప్రమాద స్థలం నుంచి పరారయ్యారని ఓ కార్యకర్త విమర్శించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఇలాంటి హడావిడి అవసరమా అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ పర్యటనల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయం చేశారని వారు గుర్తు చేశారు.

ఈ ఘటన వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. వైసీపీ నాయకులు ప్రభుత్వం, పోలీసులను లక్ష్యంగా చేసుకోగా, టీడీపీ నాయకులు జగన్ వైఖరిని తప్పుబట్టారు. రెండు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైనప్పటికీ, రాజకీయ పార్టీలు దీనిని తమ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

 

 

Tags
  • AP Politics
  • Palnadu
  • YS Jagan
  • Ysrcp

Related News

  • Europe Is Readying For Direct Conflict With Russia

    Russia: రష్యా వర్సెస్ నాటో.. మీ ఫైటర్స్ జెట్స్ వస్తే కూల్చేసామని క్రెమ్లిన్ కు హెచ్చరిక

  • Us Versities Effect On H1b Visa Fee Hike

    US: అమెరికా వర్సిటీలపై హెచ్ 1బీ పెంపు ఎఫెక్ట్..!

  • Sonam Wangchuk Arrested Days After Violent Ladakh Protests Killed 4

    Sonam Wangchuk: లద్దాఖ్ రణరంగం..సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..

  • Donald Trumps Escalator Incident At Un Sparks Conspiracy Theories

    UN: అమెరికా అధ్యక్షుడినైన నాకే అవమానమా…? పదేపదే ఐక్యరాజ్యసమితి ఘటనను గుర్తు చేసుకుంటున్న ట్రంప్…

  • Perni Nani Counter To Balakrishna

    Perni Nani: జగన్ పై బాలయ్య విమర్శకు పేర్ని నాని కౌంటర్..

  • Ys Sharmila Protest Against Tdp Alliance Govt

    Y.S. Sharmila: కూటమి లో రైతుల సమస్యలపై షర్మిల పోరాటం..

Latest News
  • Russia: రష్యా వర్సెస్ నాటో.. మీ ఫైటర్స్ జెట్స్ వస్తే కూల్చేసామని క్రెమ్లిన్ కు హెచ్చరిక
  • US: అమెరికా వర్సిటీలపై హెచ్ 1బీ పెంపు ఎఫెక్ట్..!
  • Sonam Wangchuk: లద్దాఖ్ రణరంగం..సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..
  • UN: అమెరికా అధ్యక్షుడినైన నాకే అవమానమా…? పదేపదే ఐక్యరాజ్యసమితి ఘటనను గుర్తు చేసుకుంటున్న ట్రంప్…
  • Perni Nani: జగన్ పై బాలయ్య విమర్శకు పేర్ని నాని కౌంటర్..
  • Y.S. Sharmila: కూటమి లో రైతుల సమస్యలపై షర్మిల పోరాటం..
  • Jagan: జగన్ వ్యాఖ్యలతో భారతి రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ..
  • TTA: టాంపాలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు
  • Savindra Reddy: సీబీఐకి సవీంద్రా రెడ్డి కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు
  • Zee Telugu దసరా సంబరాలు: కుటుంబానికి దసరావేడుక, సింగిల్స్‌కి సినిమా సందడి!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer