కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ.. కరోనా నియంత్రణపై
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపుపై అధికార యంత్రాంగానికి ఉన్న శ్రద్ధ కరోనా వ్యాప్తి నియంత్రణపై లేదని ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణకుమార్రాజు విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఇంకా మూడేళ్లపాటు జగన్ సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఓ తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఔషధాలపై 3 నెలలు జీఎస్టీ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.







