ఏపీలో కరోనా ఉదృతి…. 24 గంటల్లో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 74,435 మందికీ పరీక్షలు నిర్వహించగా 11,434 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,54,875 మంది వైరస్ బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,61,43,083 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించిది. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,800కి చేరింది. 24 గంటల వ్యవధిలో 7,055 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,47,629కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా గుంటూరులో 2,028 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా తూర్పు గోదావరి జిల్లాలో 253 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్తో విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి, విశాఖలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.







