ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గూడూరు సభలో జననేత

గూడూరు సభలో జననేత

సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రజలందరి కష్టాలు చూశానని, వారి బాధలన్నీ విన్నానని, అందుకే అందరికీ భరోసా ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్క నిరుపేదకు భరోసా ఇస్తున్నానని ఆయన వెల్లడించారు. 

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎండ తీవ్రంగా ఉన్నా సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. దీంతో గూడూరు పట్టణం జనసంద్రంగా మారింది.

‘నేను ఉన్నాను’

తన సుదీర్ఘ 33648 కి. మీ పాదయాత్ర గూడూరు నుంచి కూడా సాగిందని, ఆ యాత్రలో అందరి బాధలు విన్నానని, కష్టాలు చూశానని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ప్రతి కుటుంబం ఏమనుకుంటోంది? అన్న దానిపైనే నిరంతరం ఆలోచించానని, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి పేదకు చెబుతున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని భరోసా ఇచ్చారు.

చూశాను.. విన్నాను

గిట్టుబాటు ధరలు రాక రైతుల పడిన బాధలు చూశానని, గూడూరులో నిమ్మకాయ రైతుల గోడు స్వయంగా చూశానని, ఈ 5 ఏళ్లలో రైతుల ఆవేదన విన్నానని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుపేదలు.. అందరి బాధలు దారి పొడవునా విన్నానని చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక విద్యార్థులు పడిన బాధ, ఫీజులు కట్టలేక ఆ తల్లిదండ్రులు పడిన వేదన, పిల్లల ఆత్మహత్యలు కూడా చూశానన్న జననేత, ఇదే జిల్లాలో అలాంటి ఘటన జరిగిందని, అది ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

108 సర్వీసు రాక రోగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పడిన బాధ విన్నానని, ఆరోగ్యశ్రీ పథకం వర్తించక ఆ రోగులు పడిన వేదనలు చూశానని, అందరి బాధలు విన్నానని చెప్పారు.

మద్యానికి బానిసలై కుటుంబాలు చిన్నాభిన్నం అయిన పరిస్థితి చూశానని, గ్రామాలు, పట్టణాలలో మద్యం షాపుల వల్ల మహిళలకు రక్షణ కొరవడడాన్ని చూశానని, పిల్లలను చదివించుకునేందుకు కూలీకి పోతున్న అక్కా చెల్లెమ్మలను కూడా చూశానని వివరించారు.

ఇంకా చదువుకున్న పిల్లలు తనను కలిసి సమస్యలు ప్రస్తావించారని.. దుగ్గరాజుపట్నం పోర్టు కట్టాలని కోరిన వారు, దాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టి కృష్ణపట్నంకు మేలు చేశారని చెప్పారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.

ఉద్యోగాల భర్తీ లేదు 

హోదా వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన యువతను చూశానని తెలిపారు. రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల ఖాళీలు ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ తేల్చడంతో, ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారని పిల్లలు ఆశగా ఎదురుచూశారని, కానీ అది జరగక చాలా బాధ పడ్డారని తెలిపారు. ఆ తర్వాత రిటైర్మెంట్లతో ఖాళీలు మరో 90 వేలు పెరిగి, మొత్తం ఉద్యోగాల ఖాళీలు దాదాపు 2.30 లక్షలకు చేరినా, ప్రభుత్వం భర్తీ చేయలేదని గుర్తు చేశారు. 

గూడూరు

తెలుగుగంగ బ్రాంచ్‌ కాలువను గూడూరు వరకు విస్తరిస్తామని సీఎం హోదాలో మాట ఇచ్చిన చంద్రబాబు ఆ మాట కూడా నిలబెట్టుకోలేదన శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపించారు. అదే గూడూరు పట్టణానికి తాగు నీరందించేందుకు నాడు మహానేత వైయస్సార్‌ రూ.63 కోట్లతో పైప్‌ లైన్‌ ద్వారా నీరందించారని గుర్తు చేశారు. 

ఇంకా పట్టణంలో చేపట్టిన గూడూరు–1, గూడూరు–2 కలిపే ఫ్లైఓవర్‌ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. 80 కేజీల నిమ్మకాయల బస్తాకు కనీసం రూ.500 కూడా రాకపోవడంతో ఆవేదన చెందిన రైతులు, సరుకును రోడ్డుపై పోశారని చెప్పారు. 

వారందరికి భరోసా ఇస్తున్నానని, వారి ప్రతి కష్టం చూశానని.. అందుకే ‘నేను ఉన్నాను’ అని వెల్లడించారు. 

ఇప్పుడు ఏం చూస్తున్నాం?

ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మోసం తప్ప మరేదీ కనిపించడం లేదన్న శ్రీ వైయస్‌ జగన్, ప్రతి రోజూ ఒక మోసం, అబద్ధం, కుట్ర.. ఇవే చూస్తున్నామని చెప్పారు. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో అవి మరింత తీవ్రం అవుతాయని, అందుకే అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వారందరితో యుద్ధం

ఇవాళ తమ యుద్ధం కేవలం చంద్రబాబు నాయుడుతోనే కాదు. ఈనాడు, ఆ«ంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, చంద్రబాబుక అమ్ముడుపోయిన మీడియాతో చేస్తున్నామని వెల్లడించారు. గత 20 రోజులుగా వారు రోజుకో డ్రామా చేస్తున్నారని, ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపుతున్నారని ఆరోపించారు.  

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

కాబట్టి అందరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌.. ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి. ఇవాళ మన పిల్లలను ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఫీజు లక్ష రూపాయలు దాటినా ప్రభుత్వం మాత్రం ముష్టిగా రూ.35 వేలు మాత్రమే ఇస్తోందని గుర్తు చేయండి’.

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి’.

‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో ఆ అక్కా చెల్లెమ్మకే ఇస్తాడని చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కను కలవండి. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆ తర్వాత వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మరీ మరీ చెప్పండి’.

‘గ్రామాల్లో ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కకపోవడాన్ని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో అన్న మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్‌ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న కానీ చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీకు ఇచ్చే పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. అందుకే రాజన్న రాజ్యంలో మాదిరిగా జగనన్న పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’. అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

గూడూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్‌తో పాటు, పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి బి.దుర్గాప్రసాద్‌ను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :