గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సీక్వెల్
మల్టీ టాలెంటెడ్ దూసుకెళ్తున్న విశ్వక్సేన్ వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గామి తో మంచి హిట్ అందుకున్న విశ్వక్, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ కానున్నాడు. మే 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. గోదావరి జిల్లాలో కొన్ని గ్రూపుల మధ్య జరిగే గొడవల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.
రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ గెటప్ లో విశ్వక్ అదరగొట్టాడు. గోదావరి యాసలో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయంటున్నారు. ఇదిలా ఉంటే టీజర్ లాంచ్ లో భాగంగా ఈ సినిమా గురించి నిర్మాత చేసిన కామెంట్స్ విశ్వక్సేన్ ఫ్యాన్స్ లో జోష్ ను నింపాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని నాగవంశీని ఓ రిపోర్టర్ అడిగాడు. దానికి నాగవంశీ సెకండ్ పార్ట్ ఉంటుందనే విషయాన్ని తెలిపాడు. ఇంకా సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకుండానే సీక్వెల్ పై కూడా అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు నాగవంశీ. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.