నంద్యాలలో అఖిలప్రియ బాడీగార్డుపై అర్ధరాత్రి హత్యాయత్నం..
![నంద్యాలలో అఖిలప్రియ బాడీగార్డుపై అర్ధరాత్రి హత్యాయత్నం..](https://www.telugutimes.net/storage/news/news_new_73237.jpg)
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలక్షన్స్ నేపథ్యంలో ఫ్యాక్షన్ కక్షలు మళ్ళీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో.. భూమా అఖిలప్రియ బాడీగార్డుపై హత్యా ప్రయత్నం జరిగింది. అయితే దీని వెనుక రాజకీయ ప్రత్యర్ధులు ఉన్నారా లేక ఫ్యాక్షన్ కక్షలు కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మంగళవారం అర్ధరాత్రి నాడు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో..టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ బాడీగార్డు నిఖిల్ రోడ్డుపై ఓ వ్యక్తితో మాట్లాడుతూ నిలబడ్డాడు. హఠాత్తుగా అతని వైపుకు దూసుకు వచ్చిన ఒక కార్ వేగంగా అతని ఢీ కొట్టింది. కారు వేగానికి నిఖిల్ అంత ఎత్తున ఎగిరి కింద పడ్డాడు. ముందుకు వెళ్లి ఆగిన కారులో నుంచి దిగిన ఆగంతకులు నిఖిల్ పై దాడికి పాల్పడ్డారు. తన వెంటాడుతున్న వ్యక్తుల నుంచి తప్పించుకొని నిఖిల్ వీధిలోకి పారిపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తులు కూడా కారు ఎక్కి పరారయ్యారు.
ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భూమా కుటుంబం వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటున్న నిఖిల్ పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉంది అని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులు తమ దర్యాప్తును మొదలుపెట్టారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)