ASBL NSL Infratech

పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. జిల్లాలో 144 సెక్షన్ అమలు..

పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. జిల్లాలో 144 సెక్షన్ అమలు..

ఏపీలో సోమవారం నాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో హై టెన్షన్ మధ్య ముగిసింది. ఓటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా పల్నాడు జిల్లాలో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగక తప్పలేదు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు విడుదల అయ్యేంతవరకు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఈ నేపథ్యంలో స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శివ శంకర్ పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు వ్యక్తులకు మించి ఎక్కడా గుమికూడడానికి వీల్లేదని ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నారు. సభలు, సమావేశాలు వంటివి అసలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఈ సెక్షన్ నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు అమల్లో ఉంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :