గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో శ్రీ కృష్ణరాయబారం
వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఇందులో భాగంగా ప్రముఖ పద్యనాటక కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం అందరినీ ఆకట్టుకుంది. నార్త్ కరోలినా, న్యూజెర్సీ, డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాలకు చెందిన ఎన్నారై చిన్నారులు ఈ నాటకంలో సంభాషణలు(గద్యం) ఆంగ్లంలో, పద్యం తెలుగులో పలికి అమెరికాలో ఓ నూతన పద్యనాటక రీతికి శ్రీకారం చుట్టారు.
Tags :