మిస్ తెలంగాణ గుజరాతీ గా విధి ఉదేషి
శంషాబాద్లోని సూర్య ఎరీనా వేదికగా జరిగిన మిస్ తెలంగాణ గుజారతీ, మిసెస్ తెలంగాణ గుజరాతీ అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. గుజరాతీ ఎక్తా మహోత్సవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రెండు వందలకుపైగా గుజరాతీ వనితలు పాల్గొన్నారు. మిస్ తెలంగాణ గుజరాతీగా విధి ఉదేషి నిలిచింది. కంచన్ సంపత్, క్రిమాగాంధీలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మిసెస్ తెలంగాణ గుజరాతీ(40 ఏళ్ల వయసు లోపు) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మాన్ని పటేల్, ప్రగతితక్కర్ నిలిచారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గుజరాతీ సమాజ్ అధ్యక్షుడు ప్రేమ్పరక్, ఉపాధ్యక్షుడు చందులాల్ పటేల్ పాల్గొన్నారు.
Tags :