లోక్ సభ ఎన్నికల్లో ..ఓటు వేసిన బాలుడు

ప్రస్తుతం దేశంలో దశలవారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ క్రమంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని బెరాసియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెరాసియా ప్రాంతానికి చెందిన వినయ్ మెహర్ బీజేపీ స్థానిక నేత. తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన తండ్రి స్థానంలో ఆ పిల్లాడు ఈవీఎం బటన్ నొక్కి బీజేపీకి ఓటు వేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక ఖాతాల్లో చక్కర్లు కొట్టాయి. దాంతో ఇవి కాస్తా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ దృష్టికి చేరాయి. బీజేపీ, ఎన్నికల సంఘాన్ని పిల్లల ఆట వస్తువుగా మార్చింది. బీజేపీ నేత వినయ్ మెహర్ తన ఓటును కుమారుడితో వేయించారు. ఆ తతంగాన్ని వీడియో తీసి, ఫేస్బుక్లో పోస్టు చేశారు. పిల్లల్ని, మొబైల్ ఫోన్లను లోపలికి ఎలా అనుమతించారు? దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా? అని కమల్నాథ్ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి స్పందన రావాల్సి ఉంది.