కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. ఎన్టీఆర్ పేరిట
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్లో ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మింట్ అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారు. ఎన్టీఆర్ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరానని ఈ సందర్భంగా పురందేశ్వరి చెప్పారు. నిర్మాత సీతారామన్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్ నుంచి ఆమోదం వచ్చింది, సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్కు నెలరోజుల సమయం పడుతుందని, ఆ తర్వాతే విడుదల చేస్తామని ఆమె వివరించారు. తన తండ్రి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు.






