భారత్ లో 453 మంది ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన!
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో దాదాపు 453 మందిని ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం రాత్రి వారికి ఈ`మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. గూగుల్ ఇడియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ మేరకు ఉద్యోగులకు ఈ`మెయిల్ పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మారిన స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం ఇచ్చామని, ఇతర దేశాల్లో వారికి త్వరలోనే సమాచరం అందుతుందని సీఈవో సుందర్ పిచాయ్ అప్పట్లో పేర్కొన్నారు. అయితే గూగుల్ ప్రకటించిన ఈ భారీ లేఆఫ్ల ప్రక్రియలో భాగంగానే భారత్లో 453 మందిని తొలగించారా? దానికి అదనమా? అనేది స్పష్టత రాలేదు.






