Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » Chandrababu naidu revanth reddy meet in delhi to resolve inter state water disputes

CMs Meeting: జల వివాదాలపై కమిటీ..! సీఎంల భేటీలో కీలక నిర్ణయం..!!

  • Published By: techteam
  • July 16, 2025 / 09:05 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Chandrababu Naidu Revanth Reddy Meet In Delhi To Resolve Inter State Water Disputes

ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారంలో కీలక అడుగుగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C R Patil) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, శ్రీశైలం డ్యాం భద్రత వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.

Telugu Times Custom Ads

సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజర్వాయర్ల వద్ద నీటి తరలింపును ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలను తక్షణమే చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కార్యాలయాన్ని అమరావతిలో, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కొనసాగించాలని తీర్మానించారు. అలాగే కృష్ణా, గోదావరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టుతో సహా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సాంకేతిక నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని ఈ నెల 21 లోపు ఏర్పాటు చేయాలని, అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) ఈ సమావేశంలో చర్చకు రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలిసే 200 టీఎంసీల నీటిని రాయలసీమలోని కరువు ప్రాంతాలకు తరలించాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరిలో ఏటా 2500-3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, ఈ ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలకు నష్టం కలిగించదని చంద్రబాబు వివరించారు. గత 11 ఏళ్లలో తెలంగాణ నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ తాము అభ్యంతరం చెప్పలేదని, చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వినియోగించుకునే హక్కు తమకు ఉందని ఏపీ వాదించింది.

తెలంగాణ 13 అంశాలను సమావేశంలో ప్రతిపాదించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు, శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కు నీటి తరలింపు నిలిపివేయాలని, ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన తెలంగాణ ప్రాజెక్టులకు కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ సహకరించాలని కోరింది. అలాగే, తుంగభద్ర బోర్డు నీటి తరలింపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై NGT ఉత్తర్వుల అమలు, శ్రీశైలం కుడి కాల్వ ద్వారా అధిక నీటి తరలింపు నియంత్రణ, హంద్రీనీవా, వెలిగొండ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణ నియంత్రణ, శ్రీశైలం డ్యాం భద్రత, ఇచ్చంపల్లి, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు నిధులు, తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరింది.

సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని తెలంగాణ విజయంగా అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిమెట్రీ ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిందని, తాము గత తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఈ భేటీలో నిష్పక్షపాతంగా వ్యవహరించిందని, మంత్రి సీఆర్ పాటిల్ జడ్జి పాత్ర పోషించారని తెలిపారు. ఈ సమావేశం జల వివాదాలకు శాశ్వత పరిష్కారం వైపు ఒక అడుగుగా నిలిచింది, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

 

 

Tags
  • AP
  • Chandrababu
  • Delhi
  • revanth reddy
  • Telangana

Related News

  • Minister Lokesh Meets Coimbatore Industrialists

    Nara Lokesh: కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ

  • Donald Trump To Meet China President Xi Jinping

    Donald Trump: త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ..?

  • U S Military Buildup In The Caribbean Sea

    Washington: టార్గెట్ వెనుజులా .. కరేబియన్ సముద్రంలోకి అమెరికా దళాలు..

  • Mallikarjun Kharge Fires On Election Commission

    Mallikarjun Kharge: ఓట్ల చోరులను ఈసీ కాపాడుతోంది.. బిహార్‌లో జరగనివ్వం: ఖర్గే

  • Ambati Rambabu Counter On Pulivendula By Election

    Ambati Rambabu: పులివెందుల ఉపఎన్నికలపై అంబటి కౌంటర్..

  • Ysrcp To Picket Rdos On Sept 9

    Jagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..

Latest News
  • Sai Saket: అనంతపురం వాసికి.. అమెరికాలో భారీ ప్యాకేజీ
  • Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కు వ్యతిరేకంగా.. వాషింగ్టన్‌ డీసీలో
  • NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…
  • Hyundai : అమెరికాలో హ్యుండమ్‌ ప్లాంట్‌పై దాడి
  • TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం
  • Telusu Kadaa?: ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా
  • Kaloji Award: ర‌చయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం
  • Nara Lokesh: కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ
  • Donald Trump: త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ..?
  • Washington: టార్గెట్ వెనుజులా .. కరేబియన్ సముద్రంలోకి అమెరికా దళాలు..
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer