Semiconductor :కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఏపీలో

దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు (Semiconductor projects) ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సహా ఒడిశా, పంజాబ్ (Punjab)లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడిరచారు. అలాగే, పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లఖ్నవూ మెట్రో ఫేజ్ 1బీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీన్ని రూ.5,801 కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొంది. అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh) లో 700 మెగా వాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమవేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ గణనీయంగా ఉపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది.
ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా, తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య మొత్తంగా 10కి చేరింది. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ ఎకోసిస్టమ్కు ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగా అనేక ఉద్యోగాల కలప్పనకు ఉపయోగపడనున్నాయి. టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో సెమీకండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన సాధించడంలో, ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది.