America : అమెరికా సీఐఏ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు.. ఆర్మీ నియంత్రణలో

పాకిస్థాన్ అణ్వస్ర్తాలు అమెరికా సైన్యం నియంత్రణలో ఉన్నట్లు అమెరికా(America) నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకోవ్ (John Kiriakov) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే అమెరికా పట్ల భారత్ (India) తన వైఖరిని ఇటీవలి కాలంలో మార్చుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ (Pakistan)లో సీఐఏ ఉగ్రవాద నిరోధక అధికారిగా గతంలో పనిచేసిన కిరియాకోవ్ మాట్లాడుతూ పాకిస్థాన్ అణ్వాయుధాలు అమెరికన్ జనరల్ కమాండ్, కంట్రోల్లో పాక్ ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. దీని వల్ల దక్షిణాసియా ప్రాంతంలో అణు ముప్పు గణనీయంగా తగ్గిపోయిందని, ఈ కారణంగానే భారత్ పాక్తో ఘర్షణల కొనసాగింపు విషయంలో వెనుకడుగు వేసి ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.