Srisailam: శ్రీశైల మల్లన్న సేవలో నాగచైతన్య, శోభిత

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైల మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగచైతన్య, శోభిత (Naga Chaitanya, Sobhita) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం (Rudrabhishekam) నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.