రిషి సునాక్ కు షాక్ .. ఏడాది కాలంలో రూ.2 వేల కోట్లు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన అర్ధాంగి అక్షత మూర్తి ఏడాది కాలంలో రూ.2,069 కోట్లు నష్టపోయారు. బ్రిటీష్ ప్రధాని పీఠం అలంకరించిన వారిలో అత్యంత సంపన్నుడు రిషి సునాక్. ఆయన భార్య అక్షత మూర్తి పేరిట కూడా భారీగా షేర్లు ఉన్నాయి. ఈ జంట బ్రిటన్ కుబేరుల జాబితాలో 275వ స్థానంలో ఉంది. అయితే గత 12 నెలల వ్యవధిలో వారి సంపద తరుగుతూ వచ్చింది. నిరుడు సునాక్, అక్షత దంపతుల ర్యాంకు 222 కాగా, ఇప్పుడు అది మరింత పతనమైంది. ఇన్ఫోసిస్ సంస్థలో రిషి సునాక్ దంపతుల వాటా విలువ తగ్గి పోవడంతో ఈ సంపద క్షీణత చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నష్టం మినహాయిస్తే రిషి సునాక్ నికర సంపద విలువ రూ.5,446 కోట్లు, నిరుడు అది రూ.7,515 కోట్లు కాగా, ఇన్పోషిస్ ఒడిదుడుకుల కారణంగా ఆ సంపదలో ఆస్తి హరించుకుపోయింది. రిషి సునాక్ పెళ్లిడిన అక్షత మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అని విదితమే.






