Donald Trump:ఆగస్టు 1నుంచి భారత్ పై : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్పై చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు. భారత్ మిత్రదేశమే అయినా, సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ (India) ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా (Russia) నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ (Ukraine) పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనా (China)లు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుం టున్నాయి. అందుకే భారత్పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్, ఆగస్టు 1ని డెడ్లైన్గా విధించిన విషయం తెలిసిందే.
భారత్పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనపై.. భారత్ స్పందించింది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. ఈ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.