Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Jagan claims credit for google data centre

YS Jagan: ‘డేటా సెంటర్’ క్రెడిట్ ఫైట్.. వైసీపీది బరితెగింపు కాదా..?

  • Published By: techteam
  • October 25, 2025 / 04:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Jagan Claims Credit For Google Data Centre

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ విచిత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమం క్రెడిట్ కోసం పార్టీల మధ్య జరిగే పోరాటం వాస్తవాలను కప్పిపుచ్చే స్థాయికి చేరుతోంది. తాజాగా విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అనుసరిస్తున్న ప్రచార తీరు బరితెగింపుగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ అధినేత వైఖరిని సమర్థిస్తూ, వాస్తవాలను పూర్తిగా విస్మరించి ప్రచారం చేస్తున్న వైసీపీ తీరు ప్రజల జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయడమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Telugu Times Custom Ads

విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ తనకే దక్కాలని వైఎస్ జగన్ (YS Jagan) వాదిస్తున్నారు. తన హయాంలోనే అదానీ డేటా సెంటర్ (Adani Data Center) కు శంకుస్థాపన చేశామని, దానికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చిదని చెప్తున్నారు. ఈ క్రెడిట్ తనకు రాకుండా చంద్రబాబు (Chandrababu) కొట్టేయాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

అయితే, జగన్ ఇక్కడొక విషయాన్ని పూర్తిగా విస్మరించారు. వాస్తవానికి 2019 ఫిబ్రవరి 15న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదానీ గ్రూప్‌తో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీల్‌ను ఖరారు చేసి, శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నేటికీ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అంటే, విశాఖ డేటా సెంటర్‌కు తొలి అడుగులు పడిందీ.. శంకుస్థాపన జరిగిందీ చంద్రబాబు హయాంలోనే.

తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ డీల్‌ను రద్దు చేసి, అదే అదానీ గ్రూప్‌తో మళ్లీ కొత్త డీల్‌ను సెట్ చేసుకుని శంకుస్థాపన చేసింది. ఇక్కడే జగన్ తన క్రెడిట్ కోల్పోతున్నానని భావిస్తున్నారు. కానీ, చంద్రబాబు హయాంలోనే డేటా సెంటర్ కు డీల్ కుదిరిందని, శంకుస్థాపన కూడా జరిగిందనే వాస్తవాన్ని జగన్ పూర్తిగా పక్కనపెట్టేశారు. కేవలం తమ హయాంలో జరిగిన శంకుస్థాపనను మాత్రమే పెద్ద పెద్ద బ్యానర్లు, ఆర్టికల్స్‌తో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా పదే పదే అబద్ధాలను, పాక్షిక వాస్తవాలను ప్రచారం చేస్తే కొంతకాలానికి అవే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆ పార్టీ ఉన్నట్టు అర్థమవుతోంది.

కానీ జనం అమాయకులు కారు. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 డీల్ గురించి, ఫోటోల గురించి ప్రజలకు తెలుసని, వాటిని విస్మరించి ప్రచారం చేసినంత మాత్రాన నిజం మారిపోదని అంటున్నారు. తమ అధినేత తానా అంటే తందానా అనే అలవాటుతోనే వైసీపీపీ నాయకులు ఈ గుడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.

“జనం ఏమనుకుంటారోననే భయం, కనీస ఆలోచన కూడా ఆ పార్టీ నేతల్లో కనిపించట్లేదు. అందుకే దీన్ని బరితెగింపుగానే భావించాలి” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కూడా, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, వాస్తవాలను దాచిపెట్టే ధోరణి ఆ పార్టీకే మరింత నష్టం కలిగిస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలను విస్మరించి, కేవలం తమ క్రెడిట్ కోసమే ప్రచారం చేసుకునే ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, ఈ బరితెగింపు ప్రచారం ఆ పార్టీకి దీర్ఘకాలంలో ఏమాత్రం మేలు చేయదని స్పష్టమవుతోంది.

 

 

 

Tags
  • AP Govt
  • Google Data Center
  • Vizag
  • YS Jagan

Related News

  • Kolikapudi Srinivasa Rao %e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%aa%e0%b1%82%e0%b0%a1%e0%b0%bf %e0%b0%aa%e0%b1%88 %e0%b0%95%e0%b1%82%e0%b0%9f%e0%b0%ae%e0%b0%bf %e0%b0%b8%e0%b1%80

    Kolikapudi Srinivasa Rao: కొలికిపూడి పై కూటమి సీరియస్..ఇక యాక్షన్ తప్పదా?

  • Is A Revival In Ycp Possible With The Distribution Of Positions

    YCP: పదవుల పంపిణీతో వైసీపీలో పునరుజ్జీవనం సాధ్యమా?

  • Chandrababu In Bihar Election Campaign

    Chandrababu: బీహార్ ఎన్నికల ప్రచారానికి సై అంటున్న చంద్రబాబు..

  • Indian Immigrants Strengthen The American Economy

    Manhattan Study: అమెరికా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందా..? మాన్ హట్టన్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ఏం చెబుతోంది..?

  • Ap Cm Chandrababu Uae Tour

    Amaravathi: ఏపీ వైపు గల్ఫ్ తెలుగు వారి చూపు.. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని చంద్రబాబు పిలుపు..

  • Amnesty International Slams Pakistan For Listing Baloch Rights Activists As Terrorists

    Amnesty International: బలూచిస్తాన్ ది స్వాతంత్ర పోరాటం.. పాక్ తీరుపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆక్షేపణ..!

Latest News
  • Chiranjeevi: చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు ఇంటరిమ్ ఇంజంక్షన్‌ను మంజూరు చేసిన కోర్ట్
  • Dude: ‘డ్యూడ్’100 కోట్లు క్రాస్ చేయడం చాలా హ్యాపీగా వుంది : ప్రదీప్ రంగనాథన్
  • Kolikapudi Srinivasa Rao: కొలికిపూడి పై కూటమి సీరియస్..ఇక యాక్షన్ తప్పదా?
  • YCP: పదవుల పంపిణీతో వైసీపీలో పునరుజ్జీవనం సాధ్యమా?
  • Chandrababu: బీహార్ ఎన్నికల ప్రచారానికి సై అంటున్న చంద్రబాబు..
  • YS Jagan: ‘డేటా సెంటర్’ క్రెడిట్ ఫైట్.. వైసీపీది బరితెగింపు కాదా..?
  • Delhi: భారత్ ట్యాక్సీ రయ్ రయ్… ఓలా, ఉబెర్ గుత్తాధిపత్యానికి బైబై…!
  • Manhattan Study: అమెరికా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందా..? మాన్ హట్టన్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ఏం చెబుతోంది..?
  • Amaravathi: ఏపీ వైపు గల్ఫ్ తెలుగు వారి చూపు.. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని చంద్రబాబు పిలుపు..
  • Amnesty International: బలూచిస్తాన్ ది స్వాతంత్ర పోరాటం.. పాక్ తీరుపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆక్షేపణ..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer