1,100 ఏళ్లనాటి బైబిల్ కు … రూ.314 కోట్లు
కోడెక్స్ సాసూన్ అనే హీబ్రూ బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిల్లలో ఒకటి. 1,100 ఏళ్లనాటి ఈ బైబిల్ను న్యూయార్క్లో అమ్మకానికి పెడితే రూ.314 కోట్ల ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. రొమేనియాలో అమెరికా మాజీ రాయబారి ఆల్ఫ్రెడ్ బి. మోసెస్ దీన్ని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఉన్న మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ పీపుల్కు ఈ బైబిల్ను విరాళంగా ఇచ్చారు. క్రీస్తు శకం 880 నుంచి 960 మధ్యకాలంలో దీన్ని రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు. రాతపత్రుల్లో 2021లో అమెరికా రాజ్యాంగం దాదాపు రూ.400 కోట్లకు పైగా ధర పలికింది. లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్ లీసెస్టర్ 1994లో జరిగిన వేలంలో అప్పట్లోనే రూ.300 కోట్లకు పైగా అమ్ముడుపోయింది.






