మళ్లీ ముకేశ్ అంబానీయే టాప్
ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితా 2023 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానానికి చేరారు. ఈ ఏడాది ఆయన సంపద నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి 92 బిలియన్ డాలర్లకు చేరింది. ఆయన తర్వాత అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (29.3 బిలియన డాలర్లు), ఓపీ జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ (24 బిలియన్ డాలర్లు), అవెన్యూ సూపర్మార్ట్స్ రాధాకిషన్ దమానీ (23 బిలియన్ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లోనూ అంబానీ, అదానీ తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.
Tags :