బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాలయం లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం నాగ్పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్ను కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Tags :