అప్పుడే రామాయణం లీక్స్ మొదలయ్యాయి
ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు అధికారిక ప్రకటన రాకుండానే షూటింగ్ లీక్స్ మొదలైపోయాయి. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాముల గెటప్ లో సరోవరం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్ఫింగ్ అనుకోవడానికి ఛాన్సే లేదు. చాలా క్లియర్ గా ఫోటోలు కనిపిస్తున్నాయి.
అంతేకాదు షూట్ గ్యాప్ లో రణ్బీర్ సగదేహం ఆచ్చాదన లేకుండా మేకప్ వేసుకుంటున్న స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. లీకైన ఫోటోలు చూస్తుంటే సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ జంట చూడముచ్చటగా ఉంది. ఇంకా ఈ సినిమా క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. డైరెక్టర్ నితీష్ తివారీ ఎంతో సీక్రెట్ గా మెయిన్టెయిన్ చేస్తూ డీటెయిల్స్ ను బయటకు రానీయకుండా చూసుకుంటున్నాడు.
రకుల్, సన్నీ డియోల్ కూడా ఈ సినిమాలో ఉన్నారనే లీక్స్ కొన్ని నెలల నుంచే ప్రచారమవుతుంది. లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టిని పరిశీలిస్తున్నారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మొత్తం మూడు భాగాలుగా రూపొందనున్న రామాయణం ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ ను 2025లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రావణుడిగా కన్నడ రాక్ స్టార్ యష్ నటిస్తున్నాడంటున్నారు. కాకపోతే యష్ ఎంట్రీ పార్ట్ 2లో ఉంటుందంటున్నారు. రామాయణంను ఇప్పటివరకు ఎవరూ చూపించనంత గొప్పగా తీస్తానని నితీష్ చెప్తున్నాడు.