భారత ప్రజాస్వామ్య స్థితిపై ఆందోళన అవసరం లేదు : అమెరికా రాయబారి
![భారత ప్రజాస్వామ్య స్థితిపై ఆందోళన అవసరం లేదు : అమెరికా రాయబారి](https://www.telugutimes.net/storage/news/news_new_73081.jpg)
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. భారత్తో తమ సంబంధాలపై అమెరికా సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచొచ్చని తాను వంద శాతం నముమతున్నాని, ఈ సంబంధాలు 21వ శతాబ్దంలో కీలక పాత్ర పోషించనున్నాయని గార్సెట్టి పేర్కొన్నారు. విదేశీ సంబంధాల మండలి నిర్వహించిన సమావేశంలో గార్సెట్టి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, న్యాయపరమైన ఎన్నికల విధానంతో వచ్చే పదేళ్లలో భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా మారనుంది. అక్కడ చట్టాలు బలంగా ఉన్నాయి. కొండప్రాంతాల్లో ఉండేవారిని కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేసేందుకు అధికారులు కాలినడకన ఈవీఎంలను తీసుకొని వెళ్తారు. నగదు పంపిణీని అడ్డుకొనేందుకు వాహనాలను తనికీ చేసే వ్యవస్థ కూడా ఉంది. రాజకీయ వ్యవస్థలో దైర్యంగా విమర్శలు చేసే పరిస్థితి అక్కడ ఉంది. అందరి హక్కులనూ గౌరవిస్తున్నారు. కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులు మెరుగ్గా ఉన్నారు. అయితే మెరుగుపర్చుకోవాల్సిన విషయాలూ కొన్ని ఉంటాయి. అంతమాత్రాన ప్రజాస్వామ్య స్థితిగతులపై ఆందోళన అవసరం లేదని అన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)