పురందరేశ్వరి పిలిస్తే ప్రచారానికి నేను రెడీ.. జయప్రద
సినీ సెలబ్రిటీలకు రాజకీయం కొత్త కాదు. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేసి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.. అలాంటి వారిలో సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా ఒకరు. ఈరోజు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చిన జయప్రద ఆ తర్వాత మీడియాను పలకరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తనని ఆహ్వానిస్తే ఆంధ్రకి వచ్చే ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తమ హై కమాండ్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేర్చుతామని జయసుధ పేర్కొన్నారు. అంతేకాదు ఆంధ్ర కి ప్రత్యేక హోదా రావాలని.. స్వర్ణాంధ్రప్రదేశ్ సహకారం కావాలని స్వామిని కోరుకున్నట్లు తెలియపరిచారు. ఎన్టీఆర్ ప్రభావంతో అప్పట్లో జయప్రద మొదట టీడీపీ లో చేరారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి మారి.. అనంతరం బీజేపీ లో సెటిల్ అయ్యారు. మరి ఇప్పుడు సడన్ గా ఆమెకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందో అర్థం కావడం లేదు.